ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి 36 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంతో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా అయిన లేక సెయిల్ లో మిలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకుల డిమాండ్ చేశారు. ఉక్కు పోరాట పరిరక్షణ సమితి నాయకులు మోహన్ రావు విజంగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డి ఆదినారాయణ. యు రామస్వామి, వరసాల శ్రీనివాసరావు,వై టి దాస్,ఎస్ మోహన్ బాబు,కారు రమణ, కేఎం శ్రీనివాస్, ఉరికోటి సుహాసిని,దాసరి శ్రీనివాస్,ఎం ప్రసాద్,జే,నర్సింగరావు, ఎం నరసింహస్వామి,డి,మధు,ఇందల శివ, కే అప్పారావు, బి కాశి బాబు,టీ వీ కే రాజు, G పుల్లారావు, వినరసింగరావు, కే వెంకట్రావు, కే బాల శ్రీను,పీవీ, పివి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News