ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : విదేశీ కరెన్సీని దొంగిలిస్తున్న గుమస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తిరుమల పరకామణిలో నగదు లెక్కింపు సందర్భంగా జియ్యంగారి మఠానికి చెందిన క్లర్క్ తన ఇన్నర్వేర్లో కొంత విదేశీ కరెన్సీని దాచిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా, సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతడిని సోదా చేయగా అతడి వద్ద విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు.
Admin
Aakanksha News