ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : విజయనగరం జిల్లా డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బొడ్డవలస పంచాయితీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఎసీబీ అధికారులును ఆశ్రయించారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేయగా వీఆర్వో నగదు తీసుకుంటుంగా అధికారులకు చిక్కాడు.
Admin
Aakanksha News