Saturday, 08 August 2026 07:17:08 AM

సౌత్ సెంట్రల్ విజయవాడ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా..

సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే యోజెస్ కన్సల్టెంట్యు కమిటీ సభ్యులు కాలపురెడ్డి సాయిబాబా

Date : 01 March 2025 07:20 PM Views : 945

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : సౌత్ సెంట్రల్ విజయవాడ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే యోజెస్ కన్సల్టెంట్యు కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ పాలకొల్లుకు చెందిన కాలపురెడ్డి సాయిబాబా అన్నారు. రాంబాబుతో సాయిబాబా రైల్వేలో ప్రయాణికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైల్వేలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా సాయిబాబా రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. యుటిఎస్ ఏపిపి ద్వారా రైల్వే టికెట్లు సులువుదరంగా బుక్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సాయిబాబా మీడియా తో మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే లో సిబ్బంది ఎదురుకొంటున్న సమస్యలు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలకు తనవంతు కృషి చేయగలనన్నారు. మరింత అభివృద్ధికి కృషి చేశానని ఈ సందర్భంగా తెలియచేసారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు రైల్వే పరంగా సమస్యలుంటే 8919192508 నంబర్ కు ఫోన్ చేయగలరని సాయిబాబా కోరారు. ఈ సమావేశంలో ఎస్.రవికుమార్ యాదవ్, రాధా, సాయి తేజ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :