ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / రాజమహేంద్రవరం : వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల కమిటీలను ప్రకటించింది. ఇందులో రాజమహేంద్రవరం కు చెందిన మార్గాని సుశీల బీసీ సెల్ రాష్ట్ర జాయిం ట్ సెక్రటరీగా నియమితులైనారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామ కాలను ప్రకటించింది. రైతు విభాగం జోనల్(3) ఇన్చార్జిగా బూరుగుపల్లి సుబ్బారావు, వాణిజ్య విభాగం కార్యదర్శిగా వారణాసి వీర వెంకట మాణిక్య శ్రీనివాస గుప్తా, జాయింట్ సెక్రటరీలుగా పెనుగొండ కృష్ణమోహన్, బొండాడ చంద్రశేఖర్, చేనేత కమిటీ జోనల్(3) ఇన్చార్జిగా పెనుగొండ శ్రీని వాసరావు, సెక్రటరీలుగా ఉయ్యూరి వీర్రాజు, పప్పు సింహాచలం నియమితులయ్యారు.
Admin
Aakanksha News