Tuesday, 23 June 2026 12:59:02 AM

అక్టోబర్ 22 నుంచి అమరావతిలో ‘డ్రోన్ సమ్మిట్’...

Date : 17 October 2024 05:47 PM Views : 340

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : అమరావతిలో అక్టోబర్ 22 నుంచి రెండు రోజులపాటు పౌర విమాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ‘డ్రోన్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో డ్రోన్ కంపెనీలు, విదేశీ సంస్థలు, ఇతర వాటాదారులు పాల్గొనే అవకాశం ఉంది.అక్టోబరు 22న 5,000కు పైగా డ్రోన్లతో ‘డ్రోన్ షో’ కూడా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఐ అండ్ ఐ) శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ గురువారం తెలిపారు. ఇప్పటి వరకు 1,000 మందికి పైగా ప్రతినిధులు సమ్మిట్ కోసం నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :