Sunday, 19 April 2026 02:53:36 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ అదికారులకు పట్టుబడ్డ తహసీల్దార్‌

Date : 03 December 2024 07:25 PM Views : 294

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / నెల్లూరు జిల్లా : ఓ రైతు వద్ద లంచం తీసుకున్న తహసీల్దార్‌ను ఏసీబీ అదికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పొలం వివరాల కోసం తహసీల్దార్‌ను సంప్రదించాడు.అయితే తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి రూ. 20 వేల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు వ్యూహం ప్రకారం తహసీల్‌ కార్యాలయంపై దాడి చేశారు. రైతు నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన అధికారులు తహసీల్దార్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :