ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తిరుమల శ్రీవారికి ప్రీయమైన లడ్డు కల్తీ జరిగిన విషయం కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఎ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. రెండు రోజులుగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. అప్పనతో పాటు మరో అరుగురు టీటీడీ అధికారులను సిట్ విచారిస్తోంది. లడ్డూ తమారీ కల్తీ కేసులో ఇఫ్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు.
Admin
Aakanksha News