ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార కుటుంబాల కోసం స్వర్ణకార డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసిన సందర్భంగా స్వర్ణకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ కి కేక్ తినిపించారు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ . రాష్ట్రవ్యాప్తంగా 12 రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల సంబరాలు అక్టోబర్ 18 నుండి నవంబర్1వ తారీకు వరకు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ లకు అభినందనలు తిలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కర్రి వేణుమాధవ్ ప్రకటించారు .జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాష్ట్ర నాయకులు పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు బిజెపి ఎన్డీఏ నేతలు పాల్గొంటారని కర్రీ వేణుమాధవ్ తేలిపారు
Admin
Aakanksha News