ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. రాజేంద్రప్రసాద్కు వెంటనే చికిత్స చేయగా.. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. బాబు రాజేంద్రప్రసాద్కు యంజోగ్రామ్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. ఇటు బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు.
Admin
Aakanksha News