ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : విద్యా ప్రమాణాలు పెంచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎపి మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అసర్ నివేదికతో విద్యా వ్యవస్థలో జగన్ చేసిన విధ్వంసం బయటపడిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ జగనే అని మరోసారి రుజువైందని చురకలంటించారు. ఎపి మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెచ్చేందుకు అభిప్రాయాలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News