ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ప్రేమించాలని కొన్నాళ్లుగా యువతి వెంటపడుతున్న ఏడుకొండలు అనే యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రేమ పేరిట ఓ కిరాతకుడు దారుణానికి తెగబడ్డాడు.నిశ్చితార్థమైన యువతిని ప్రేమిస్తున్నానంటూ, పేరం ఏడుకొండలు అనే వ్యక్తి కొన్నాళ్లుగా వేధించాడు. దీంతో ప్రేమను నిరాకరించిన ఆమెపై ఆగ్రహించిన ఏడుకొండలు దాడికి పాల్పడ్డాడు.ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశాడు. మొత్తం 12 మందిని గాయపరిచాడు. ఆమెతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో.. గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తుండగా..మిగతా 9 మందిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Admin
Aakanksha News