ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : రైతులకు కనీస మద్దతు ధరపై అవగాహన – అధికారులు సూచనలు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో ఐకెపి సెంటర్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఐకెపి క్లస్టర్ కోఆర్డినేటర్, VOA సెంటర్ ఇన్చార్జ్ రామప్ప దావీద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిసి దుర్గయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అభిలాష్ గౌడ్ హాజరై రైతులకు మార్గదర్శక సూచనలు అందించారు.సిసి దుర్గయ్య మాట్లాడుతూ...ప్రభుత్వం ఈ సీజన్లో ధాన్యానికి కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్కు రూ.2389గా నిర్ణయించినట్టు తెలిపారు. రైతులు తూకం వేసిన వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. ఏ రకమైన ఆలస్యం లేకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.రైతులు తడిసిన వడ్లు, సరిపోని ధాన్యాన్ని సెంటర్కు తీసుకురాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడ్లను శుభ్రంగా, తేమ లేకుండా తూకం వేయించాలన్నారు. ధాన్య నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. సెంటర్ కార్యకలాపాలు పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. టాప్లా సక్రమంగా అమర్చడం, లారీలు సమయానికి రానిచూడడం వంటి అంశాలను రైతులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఇన్చార్జిలు, ఓబీలు, గ్రామస్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభమవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News