ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేటలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాపన్నపేట ప్రభుత్వ పాఠశాలను ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపయ్య మాట్లాడుతూ బీసీలకు తగిన రాజకీయ, విద్యా అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పర్వయ్య, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్, నాయకులు కృష్ణా తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News