Friday, 11 July 2025 05:29:24 AM

ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ ఎస్‌ఈ నరేష్...

80వేలు లంచం తీసుకుంటు ఉండగా వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు

Date : 18 June 2025 11:44 AM Views : 183

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మహబూబ్‌నగర్‌ జిల్లా : మహబూబాబాద్ జిల్లాలో అవినీతి అధికారులపై రాష్ట్ర ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. విద్యుత్ శాఖ సీనియర్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నరేష్‌ను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హస్తినాపురం కాలనీలోని నివాసంలో నరేష్‌కు చెందిన ఇంట్లో శనివారం సాయంత్రం ఈ వలపన్ని అమలు చేశారు. ఇంట్లో నగదు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.80,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఈ అధికారికి బలమైన ఆధారాలతో పట్టుబడింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి అతన్ని పట్టుకున్నారు.ఈ ఘటనపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులపై కూడా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రాథమికంగా పలు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారులపై తీవ్ర దృష్టి సారించిన ఏసీబీ అధికారులు వరుసగా ట్రాప్‌లు వేస్తూ మోదీ తీరుగా పనిచేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నరేష్ గత కొంత కాలంగా వివిధ పనుల కు సంబంధించి కాంట్రాక్టర్లను లంచం కోసం దోచుకుంటున్నాడని ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :