ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల రాంకిషన్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో రాదాకిషన్ మాట్లాడుతూ రాంకిషన్ నాలుగు దశాబ్దాల విద్యా ప్రస్థానంలో అనేక మంది విద్యార్థుల జీవితాలను వెలిగించారని, సామాజిక సేవల ద్వారా చిరస్మరణీయ ముద్ర వేశారని ప్రశంసించారు. ఈ వేడుకలో డీఎస్వో రాజిరెడ్డి, కొండల్ రెడ్డి, నీలకంఠం, పీడీ ఆనందం, డాక్టర్ చంద్రశేఖర్, మధుమోహన్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News