ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఫస్ట్ కంపెనీ పేరుతో గోదావరిఖనిలో గత కొంత కాలం కిందట ఏర్పాటైన ఓ ఫైనాన్స్ కంపెనీ మొదట పెట్టుబడుల పేరుతో అందరిని ఆకర్షించి వారికీ నెలనెలా డబ్బులు చెల్లించి చివరకు అధిక సంఖ్యలో పెట్టుబడులు తీసుకొని బోర్డు తిప్పేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఫైనాన్స్ కంపెనీలో అధిక సంఖ్యలో పెట్టుబడులు పెట్టిన వారు. కంపెనీ నుండి డబ్బులు రావాల్సిన వారు లబోదిబోమంటున్నారు. దీనికి సంబందించిన చైర్మన్ మంచిర్యాల జిల్లా కు చెందిన వ్యక్తి కావడం గతంలో కూడా సదురు వ్యక్తిపై ఇలాంటి ఘటనలు ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఫైనాన్స్ కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కథనం ఈ రోజు "ఆకాంక్ష న్యూస్" లో
Admin
Aakanksha News