Monday, 16 June 2025 02:09:34 AM

2,700లకు చేరిన మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య....

Date : 01 April 2025 04:48 PM Views : 278

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : మయన్మార్ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసింది. గత శుక్రవారం రిక్టార్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కూడా భూమి పలుమార్లు కంపించింది. దీంతో దేశంలో ఎటూ చూసిన విధ్వంసమే కనిపిస్తుంది. ఈ ప్రకృతి విలయతాండవం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య.. 2,700లకు చేరింది. ఇప్పటికూ 4,500 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా 441 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.మయన్మార్‌లో సంభవించిన ఈ భూకంప ప్రభావం పొరుగు దేశాలపై చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలపై కూడా పడింది. ఆ దేశాల్లో కూడా భూకంపం సంభవించింది. ఇక మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశానికి అవసరమైన సాయాన్ని భారత్ పంపించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :