ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : మాంచెస్టర్గా ఆఫ్ ఇండియాగా పిలవబడే రామగుండం నియోజకవర్గం పరిశ్రమలకు నీలయంగా పేరు గాంచింది. గోదావరి లోయ బొగ్గు క్షేత్రాలు, ఏన్టీపీసీ నడుపుతున్న భారతదేశంలోని అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బసంత్ నగర్ కేశోరాం సిమెంట్,రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, సోలార్ ఫోటోవోల్టాయిక్ యూనిట్ ఇలా ఎన్నో పరిశ్రమలకు పెట్టింది పేరు రామగుండం నియోజకవర్గం. ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన రామగుండం నగరపాలక సంస్థ, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ తరువాత తెలంగాణాలోని నగర పాలక సంస్థలలో అత్యంత జనాభా కలిగిన నగరాల జాబితాలో 6వ స్థానంలో ఉంది.అయితే ఇక్కడ రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విషాద వైఫల్యగాధ ఉందనే చెప్పవచ్చు. 1989 తరువాత నుంచి మేడారం నియోజకవర్గం ఉన్నప్పుడు, ఇటు రామగుండం అయిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సారి కూడా ఎన్నికల్లో గెలుపొందిన అవకాశమే లేదు. ఐన కూడా కొంత మంది కింది క్యాడర్ నాయకులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన, ఎంత మంది నాయకులు మరీనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తూ అధిష్టానం రామగుండంలో జరిగిన ఎన్నికల్లో ఏ అభ్యర్థిని నిలబెట్టిన నాయకుడి గెలుపు కోసం తమ కుటుంబాలను కూడా కాదు అనుకోని పార్టీ జెండా పట్టుకొని తిరిగిన నాయకులకు రామగుండంలో గుర్తిపు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడు అధికారంలో ఉన్న పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ నమ్మిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన, ఎన్ని ఇబ్బందులు పెట్టిన కేసులైన కూడా లెక్క చేయకుండా మొదటి నుండి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులకు నేడు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇతర పార్టీల నుండి ఎన్నికల సమయంలో వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇస్తూ కష్టపడ్డా నాయకులను గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. 30ఏళ్ల తురవాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ౩౦ ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారికీ గుర్తింపు ఏది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఏది...?
తెలంగాణ రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వరుసగా ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చరిత్ర లేదు. ఒక్క రామగుండం నియోజకవర్గంలో తప్ప, ఐన కూడా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పార్టీ నాయకుడి గెలుపు కోసం,పార్టీ అధికారంలోకి రావడంలో ఎంతో మంది కింది స్థాయి నాయకుల కృషి ఉందనేది చెప్పకనే చెప్పవచ్చు. నాడు పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం కష్టపడ్డా నాయకులు నేడు ఎక్కడ ఉన్నారు. వారికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డా వారిని కాదని మధ్యలో వచ్చిన కొంత మంది నాయకులను అందలం ఎక్కించడం వెనుక అర్ధం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో రామగుండంలో ఉన్న పార్టీలు అన్ని తిరిగి ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి వద్దకు వెళ్లి భజన చేయడం మొదలు పెట్టి వారు అనుకున్న పనులను చేయించుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పార్టీ కోసం తానే మొదటి నుండి కష్ట పడి పని చేసి నాయకుడిని గెలిపించాననే స్థాయిలో ఊదరగొడుతూ చెప్పే మాటాలకు ప్రజలు నవ్వుకుంటూ అయన చేష్టలకు ముక్కున వేలేసుకుంటున్నారు. రామగుండం నియోజకవర్గంలో సీపీఎం,సీపీఐ మినహాయించి అన్ని పార్టీలు తిరిగిన ఘనత కూడా సదురు నాయకులకే దక్కుతుందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఆ రెండు పార్టీలకు సంబందించిన నాయకులు ఇప్పటి వరకు రామగుండంలో ఎవరు కూడా గెలవలేదనే ఆ పార్టీల తీర్థం తీసుకోలేదని సోషల్ మీడియాలో జోరుగా సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు అయితే తన అడుగు పెడితేనే ఎమ్మెల్యేగా గెలిచారాట, అంతే కాదు అయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారే ఎమ్మెల్యేగా గెలుస్తారట.. అదేదో అడుగు అయన కోసమే వేసుకొని ఆయనే ఎమ్మెల్యేగా రామగుండం నియోజకవర్గంలో తానే గెలవచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తూ నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి జోకులు వేయడం మానుకోవాలని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఎవరో అడుగు పెడితేనో... ఎవరో దగ్గరకు వస్తేనో గెలవరూ. రామగుండం నియోజక వర్గంలో ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలు, ప్రజలకు నమ్మకం కలిగించినప్పుడే ఆ నేతను రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించి రాజుల చూసుకుంటారనేది గుర్తుచుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు.
Admin
Aakanksha News