Monday, 16 June 2025 03:34:52 AM

కేదార్‌నాథ్‌లో రోప్‌వే నిర్మాణానికి కేంద్ర క్యాబినేట్ ఆమోదం...

Date : 06 March 2025 06:22 AM Views : 158

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేదార్‌నాథ్‌లో రోప్‌వే నిర్మాణానికి కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో రూ.4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకుప్ర గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సోన ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకూ 12.9 కిలో మీటర్ల వరకూ సాగే ఈ రోప్‌వే పూర్తైతే.. 8-9 గంటల పాటు సాగే ట్రెక్కింగ్ ప్రయాణాన్ని.. కేవలం 36 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.ప్రస్తుతం కేదార్‌నాథ్‌కి వెళ్లే భక్తులు గౌరీకుంఢ్ నుంచి కాలినడకన, గుర్రాలపై లేదా హెలికాఫ్టర్ ద్వారా కేదార్‌నాథ్ చేరుకోవాలి. కానీ, ఇప్పుడు రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :