ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : అమెరికాలోని వాషింగ్టన్లో కాన్సాస్ నుంచి ప్రయాణికులతో వస్తున్న పిఎస్ఏ ఎయిర్లైన్స్ విమానాన్ని శిక్షణలో ఉన్న మిలటరీ హెలీకాప్టర్ ఢీకొట్టడంతో రెండు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది, హెలికాప్టర్ లో నలుగురు ఉన్నట్టు సమాచారం.జరిగిన విమాన ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 18 మృతదేహాలు వెలికితీశారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు, రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోంది.మృతదేహాల కోసం వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు
Admin
Aakanksha News