ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం తరచూ చెబుతున్నా కొందరు అధికారులు మరికొందరు వారి సిబ్బంది మాత్రం ఆ ఆదేశాలను పక్కనబెట్టి ప్రజలతో తాము కావాలంటే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తున్నారు. తాజాగా స్థానిక ఓ పోలీస్ ఠానా పరిధిలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. ఠానా అధికారి ఛాంబర్ ముందు విధులు నిర్వర్తిస్తున్న ఒక కాపలాదారి ప్రవర్తన స్థానికుల ఆగ్రహానికి గురవుతోంది. ఏ విషయమైనా చెప్పుకోవాలని వచ్చిన వారిని చూడగానే అధికారి బిజీగా ఉన్నారు.ఇప్పుడు లోపలికి వెళ్లరాదు అంటూ అడ్డుకుంటున్నాడు. నిజంగా అధికారి బిజీగా ఉన్నారా లేదా అన్నది తెలియకపోయినా, తానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దేవుడి ఆలయంలోనైనా దర్శనం కోసం బయటే క్యూలైన్ ఉంటే, ఇక్కడ మాత్రం అధికారిని చూడాలంటే కాపలాదారి అనుమతి తప్పనిసరిగా కావాలనే పరిస్థితి నెలకొంది. అనుమతి లేకుండా అడుగు పెట్టాలన్నా గట్టిగా తిప్పి కొడుతున్న ఆ కాపలాదారి ప్రవర్తనతో కొందరు వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం.మా సమస్య చెప్పుకోవడానికి వచ్చినా లోపలికి అనుమతించట్లేదు. చుట్టుపక్కల వాళ్లకు మాత్రం వీలుగా అనుమతిస్తారు. ఇదేంటో అర్థం కావడం లేదు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపలాదారి అధికారి పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంతో, సాదారణ ప్రజలు భయంతో వెనుతిరుగుతున్నారు. దీంతో సదురు ఉన్నతాధికారికి చెడ్డ పేరు వస్తుందని అపవాదు మూట కట్టుకుంటుంది. ఇప్పటికైనా సదురు ఉన్నతాధికారి వీరిపై కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.ప్రజల సర్వీస్ కోసం ఉన్న కార్యాలయాలు, అక్కడి అధికారుల పని తీరు ప్రజలకు చేరువ కావాలని ఆశిస్తూ… కాపలాదారి దురుసు ప్రవర్తనపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Admin
Aakanksha News